Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 March 2025, 3:30 pm Posted by : ramakrishna

దక్షిణముఖి ఆంజనేయస్వామి ఆలయ శిఖర ప్రతిష్టాపన

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని అంబం (ఆర్) గ్రామంలో శ్రీ దక్షిణముఖి ఆంజనేయస్వామి ఆలయ విగ్రహ శిఖర ప్రతిష్టాపన, మహా కుంభాభిషేకం వేడుకలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామి వారికీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు దంపద జంటలు యజ్ఞ కార్యక్రమంలో పాల్గొని, స్వామి వారికీ ప్రత్యేక పూజలు చేపట్టారు. మూడు రోజుల పాటు యజ్ఞ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. అలాగే మంగళవారం రోజున శ్రీ శ్రీ శ్రీ విరూపాక్ష విద్యారణ్య స్వామి హంపి పీఠాధిపతిచే అనుగ్రహ ప్రవచనం ఉంటుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పేర్కొన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.