వెబ్ న్యూస్, బతుకమ్మ : కరణ్ సింగ్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ’కేసరి ఛాప్టర్ 2‘మూవీ ట్రైలర్ ను చిత్ర బృందం శనివారం విడుదల చేసింది. భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో నెత్తుటి అధ్యాయం 1919లో జరిగిన జలియన్ వాలా బాగ్ మారణకాండ ఉదంతాన్ని ఆధారంగా చేసుకొని ఈమూవీని నిర్మించారు. మే 23న ఈసినిమా తెలుగులో విడుదల కానుంది. ఈనేపథ్యంలో చిత్ర బృందం విడుదల చేసిన ఈట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది.