- రుద్రూర్ ఎస్సై సాయన్న
రుద్రూర్, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు రుద్రూర్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రుద్రూర్ ఎస్సై సాయన్న హెల్మెట్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై సాయన్న మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలన్నారు. హెల్మెట్ బరువు కాదు బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. అలాగే రోడ్డు నియమాలను పాటించాలని, యువత మదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, సైబర్ నేరాలు, మహిళల రక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.