Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 June 2025, 2:11 pm Posted by : ramakrishna

అవతరణ వేడుకల అతిథి ఈరవత్రి

నిజామాబాద్, బతుకమ్మ: జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ హాజరుకానున్నారు. ఉదయం 9.30గంటలకు వినాయక్ నగర్ లోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం 10గంటలకు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించనున్న అవతరణ వేడుకల్లో అనిల్ పాల్గొంటారు.