వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం
పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన మంత్రులు సురేఖ, పొన్నం హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఎల్లమ్మ తల్లికి మంత్రులు కొండాసురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఎంపీ అనిల్, మేయర్ విజయలక్ష్మీ, కలెక్టర్ హరిచందన్, అధికారులు పాల్గొన్నారు. కల్యాణం చూసేందుకు లక్షల మంది భక్తులు తరలివచ్చారు.