Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 August 2024, 3:06 pm Posted by : ramakrishna

కానిస్టేబుల్ ను పరామర్శించిన గవర్నర్

బతుకమ్మ హైదరాబాద్ : పాము కాటుకు గురై ములుగు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీస్ కానిస్టేబుల్ ను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ వర్మ బుధవారం పరామర్శించారు. లక్నవరం అడవుల్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ను ప్రమాదవశాత్తు పాము కాటు వేసింది. ఇది గమనించిన తోటి సిబ్బంది వెంటనే ఆయనను ములుగు జిల్లా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న గవర్నర్, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, శిశు సంక్షేమ, నీటి సరఫరా శాఖ మంత్రి దాసరి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్, ఎస్పీ శబరీష్ కానిస్టేబుల్ పరామర్శించారు.