మహిళలను కోటీశ్వర్లు చేయడమే ప్రభుత్వ ధ్యేయం
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి నిజామాబాద్ రూరల్, బతుకమ్మ: మహిళలను కోటీశ్వర్లు చేయడమే ప్రభుత్వ ధ్యేయమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి పేర్కొన్నారు. నిజాంమాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం మంగళవారం రోజున నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిరుపేదలకు ఎంతో...