నిజామాబాద్, బతుకమ్మ : జిల్లాకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులైన అమిదాల సుదర్శన్ సోమవారం ఇంచార్జీ జిల్లాజడ్జి కనక దుర్గ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని ఆమె చాంబర్లలో సహచర న్యాయవాదులు వి.భాస్కర్, జయ ప్రకాష్ లోయ,ప్రభాకరన్ రెడ్డి,మామిల్ల సాయరెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి,బార్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ లతో కలిసివెళ్లి తన నియామక విషయాన్ని తెలియజేశారు.ఈ సందర్భంగా జడ్జి కనక దుర్గ ,సుదర్శన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ పరమైన సివిల్ దావాలలో త్వరితగతిన న్యాయసేవలు న్యాయార్థులకు అందజేయడానికి కృషి చేద్దామని అన్నారు.