Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 March 2026, 8:04 pm Posted by : ramakrishna

ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉంది

 

. . . పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

 

. . . ఘనంగా ప్రభుత్వ అధికారిక ఇఫ్తార్ విందు, రంజాన్ తోఫా పంపిణీ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని ఖిల్లా రోడ్‌లో ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన అధికారిక ఇఫ్తార్ విందు సోమవారం సాయంత్రం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ప్రభుత్వం తరఫున అందజేస్తున్న రంజాన్ తోఫాదుస్తుల కిట్లను అతిథులు పంపిణీ చేశారు. ​

 

The government is committed to the welfare of minorities.

 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్, పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్,ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ హాజరయ్యారు. ​ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ​ప్రభుత్వం మైనారిటీల కోసం విద్య, ఉపాధి రంగాల్లో అనేక పథకాలను అమలు చేస్తోందని, ​మైనారిటీ విద్యార్థుల కోసం ప్రత్యేక స్కాలర్‌షిప్‌లు, విదేశీ విద్యానిధి వంటి సదుపాయాలను మెరుగుపరిచామన్నారు. ​ పేద ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం షాదీ ముబారక్పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని, ​వక్ఫ్ భూముల రక్షణ, ఉర్దూ భాషా వికాసానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ​ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

 

The government is committed to the welfare of minorities.

 

ప్రభుత్వ సలహాదారు మాట్లాడుతూ గంగా-జమునా తెహజీబ్‌కు నిజామాబాద్ ప్రతీక అని కొనియాడారు. రంజాన్ పవిత్ర మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి నిదర్శనమని, ముస్లిం సోదరులందరూ సుఖసంతోషాలతో పండుగ జరుపుకోవాలన్నదే ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. పేద మైనారిటీలకు అండగా ఉండటానికే ప్రభుత్వం ఈ తోఫా కార్యక్రమాన్ని చేపట్టిందని ఆయన తెలిపారు. తాహెర్ బిన్ హందాన్ మాట్లాడుతూ ప్రభుత్వం మైనారిటీ సంస్థలను బలోపేతం చేస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఇఫ్తార్ అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, దేశ శాంతి సౌభాగ్యాల కోసం ప్రార్థన చేశారు.

The government is committed to the welfare of minorities.