Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 September 2025, 8:00 pm Posted by : ramakrishna

బాల్య మిత్ర ఫౌండేషన్ ఔదార్యం

  • మృతుల కుటుంబానికి నగదు, నిత్యావసర సరుకుల పంపిణీ

 

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిరుపేద కుటుంబమైన ఒకే కుటుంబంకు చెందిన తండ్రి షేక్ గూడు,కొడుకు కలిమ్ లు కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో  మరణించారు.ఆ నిరుపేద కుటుంబం దీన గాదని తెలుసుకున్న బాల్యమిత్ర ఫౌండేషన్ సభ్యులు మంగళవారం 5వేల రూపాయల నగదు,పదివేల రూపాయలు విలువచేసే ఇంటికి కావలసిన నిత్యవసర సరుకులను ఆ కుటుంబ సభ్యుల కు అందించారు.ఈ కార్యక్రమంలో బాల్యమిత్ర ఫౌండేషన్ అధ్యక్షుడు చందుపట్ల లక్ష్మారెడ్డి ,రాగుల ఎల్లారెడ్డి, గుండారపు వేణురెడ్డి,  డాక్టర్ మహమ్మద్ హైమద్, పల్లెరాజు, బాలకిషన్ గౌడ్, పాముల కుమార్ , రేసు మోహన్, శ్రీనివాస్ రెడ్డి, దుంపటి శ్రీనివాస్, గుడి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

The generosity of the Balya Mitra Foundation