Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 October 2024, 2:02 pm Posted by : ramakrishna

జిల్లా కలెక్టర్ ను కలిసి నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం

నిజామాబాద్ సిటి, బతుకమ్మ:

తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల జిల్లా సంఘం నూతన కార్యవర్గం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంది హనుమంతును మర్యాధపూర్వకంగా కలిసారు. సొమవారం జిల్లా కలెక్టరేట్ లో టిఎన్ జిఓ మాజీ జిల్లా అధ్యక్షుడు గైనీ గంగారాం అధ్వర్యంలో  నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటి కలెక్టర్ ను కలిసి పుష్పగుచ్చం అందచేశారు. ఈ సంధర్బంగా జిల్లా కలెక్టర్ హన్మంతు నూతన కార్యవర్గానికి అభినంధనలు తెలుపుతూ సమస్యలు ఎమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కొరారు. జిల్లా కలెక్టర్ ను కలిసిన వారిలో నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు నేరేళ్ల శ్రీను, ప్రధాన కార్యదర్శి సర్ధార్ బీరేంధర్ సింగ్ తో పాటు  కమిటి సభ్యులు పాల్గోన్నారు.