జిల్లా జడ్జి సునీత కుంచాల
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఈ దీపావళి పండుగ ప్రతి ఒక్కరిలో నూతన వెలుగులు నిండాలని ప్రజలందరూ ఈ పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల పేర్కొన్నారు. జిల్లా ప్రజలందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఈ పండగ వేల పిల్లలు బాణాసంచాలు కాల్చే సమయంలో వారి వారి తల్లిదండ్రులు పక్కనే ఉండి వారిని గమనించాలన్నారు. బాణాసంచాలు కాల్చే సమయంలో పిల్లలు గాయాలు పాలు అవ్వకుండా చూడాలన్నారు.