Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 March 2025, 8:36 pm Posted by : ramakrishna

జర్నలిస్టుల కార్యక్రమాలు అభినందనీయం

  • ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జర్నలిస్టులు మతసామరస్యానికి ప్రతీక గా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ అన్నారు. రంజాన్ మాసం పురస్కరించుకుని నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆద్వర్యంలో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పవిత్ర రంజాన్ మాసం లో ముస్లిం మైనారిటీ ల కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం భినందనీయమని కొనియాడారు. హిందూ ముస్లిం లు సోదర భావంతో ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఖుద్దుస్, సీనియర్ నాయకులు జావీద్ అక్రమ్, బీజేపీ మైనార్టీ మోర్చా నాయకులు మునీర్ రషీద్, ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణ, శేఖర్ కార్యవర్గ సభ్యులు సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

The efforts of journalists are commendable.