Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 January 2026, 8:42 pm Posted by : ramakrishna

సమిష్టి కృషితోనే మహిళల సంఘాల అభివృద్ధి సాధ్యం

వేల్పూర్, బతుకమ్మ :

 

మహిళా సంఘాల ఆర్థిక అభివృద్ధి సమిష్టి కృషితోనే సాధ్యమవుతుందని టీఎన్జీవోస్ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు బత్తుల మాణిక్యం అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో గురువారం గ్రామ సమన్వయకర్తల సమావేశంలో డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. టీఎన్జీవోస్ యూనియన్ ఉద్యోగులందరి సమస్యలపై నిరంతరం పోరాడుతు ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళుతుందని ఆయన పేర్కొన్నారు. అత్యధికంగా సభ్యత్వాలు కలిగిన అతిపెద్ద యూనియన్ గా టీఎన్జీవోస్ యూనియన్ గుర్తింపు పొందిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డియంజిలు భోజన్న, మాధవరావ్, సీసీలు వెన్న మురళి, సాయన్న, రాధ, సరళ, లక్ష్మీ, సునీత మండలంలోని అన్ని గ్రామాల సమన్వయకర్తలు, తదితరులు పాల్గొన్నారు.