. . . యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి తెలంగాణా ఇంచార్జి రోష్ని జైస్వాల్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాలన బాగుంది ..ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని అని యూత్ కాంగ్రెస్ జాతీయ సెక్రటరీ తెలంగాణా ఇంచార్జి రోష్ని జైస్వాల్పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ సమీక్ష సమావేశం జిల్లా అధ్యక్షులు విపుల్ గౌడ్ అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ భవన్ లో సోమవారం జరిగింది…కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూత్ కాంగ్రెస్ జాతీయ సెక్రటరీ,తెలంగాణా ఇంచార్జి రోష్ని జైస్వాల్ పాల్గొన్నారు… ఈ సందర్భంగా రోష్ని జైస్వాల్, విపుల్ గౌడ్ ల మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ బలోపేతం దిశగా అడుగులు వేస్తే గ్రామ,మండల,అసెంబ్లీ కమిటీలకు ఆశావహుల పేర్లు ప్రతిస్పందించాలి అని అన్నారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పార్టీని బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధికార ప్రతినిధి రాణి రాథోడ్,జిల్లా ఉపాధ్యక్షులు అద్నాన్,జనరల్ సెక్రటరీ ఆదిత్య పాటిల్,మాజీ కార్పొరేటర్ గడుగు రోహిత్,అసెంబ్లీ అధ్యక్షుడు కార్తీక్ యాదవ్,మహేందర్, బైండ్ల ప్రశాంత్,మెయిన్ యూనిస్, నాయకులు ముబాసిర్, దినేష్, మతీన్, షోయబ్, గైని కిరణ్,యగ్నేష్ తదితరులు పాల్గొన్నారు…
