- ఉపాధ్యాయుడిగా మారిన జిల్లా పాలనాధికారి
బతుకమ్మ, భిక్కనూరు: బిక్కనూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిస్థితిని సమీక్షించి కలెక్టర్ స్వయంగా పదో తరగతి విద్యార్థులకు సోలార్ సిస్టం పై పాఠం బోధించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజన పథకం స్కూల్లో మేను ప్రకారం ఇస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.పాఠశాల నుండి అంతరిక్ష పరిశోధన సంస్థ( ISRO ) సందర్శనకు ఎంపికైన విద్యార్థులను అభినందించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు ఎమ్మార్వో సునీత ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి ఎంఈఓ రాజగంగారెడ్డి ఉపాధ్యాయులు ఉన్నారు.
