వర్గీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

మాల మహానాడు నిరసన ర్యాలీ.. నాయకుల అరెస్ట్ బతుకమ్మ, బోధన్ : వర్గీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ నవిపేట మండల కేంద్రంలో మాలమహనాడు ఆధ్వర్యంలో బుధవారం నాడు నిరసన ర్యాలీ నిర్వహించారు. భారత్ బంద్ లో భాగంగా మాలమహనాడు నాయకులు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ బాసర రహదారిపై రాస్తారోకో ర్యాలీ చేపట్టారు. అంబెడ్కర్ విగ్రహం వద్ద నినాదాలు చేశారు. వర్గీకరణ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాలమహనాడు నాయకులు మాట్లాడుతూ మాలాల మనోభావాలను దెబ్బదీసే వర్గీకరణ నిర్ణయాన్ని...