Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 May 2025, 6:02 pm Posted by : ramakrishna

ముఖ్యమంత్రి వ్యాఖ్యలు బాధాకరం

  • తపస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధాకరమని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం( తపస్ )జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పరళి కృష్ణవేణి, బట్టు బద్రీనాథ్ అన్నారు. స్థానిక సంఘ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ జీతాల నుంచి జమ చేసుకున్న డబ్బులను మాత్రమే అడుగుతున్నారని అన్నారు. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు వారి హక్కుల కోసమే పోరాటం చేస్తున్నారని తెలిపారు. వెంటనే పెండింగ్లో ఉన్న డీఏ లను, అన్ని రకాల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని, పీఆర్సీని వెంటనే ప్రకటించాలని కోరారు. లేకపోతే రాష్ట్ర శాఖ సూచన మేరకు ఉద్యమ కార్యచరణని ప్రకటించవలసి వస్తుందని హెచ్చరించారు.