Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 May 2026, 5:26 pm Posted by : ramakrishna

జీలుగు విత్తనాలను పంపిణి చేసిన సోసైటి చైర్మన్

 

నవీపేట్, బతుకమ్మ :

 

నవిపేట్ మండలం బినోల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిదిలోని బినోల, నాళేశ్వర్ గ్రామంలోని సోసైటి ఎరువుల గోదాంలో రైతులకు సబ్సిడి మీద జీలుగు విత్తనాలను సంఘ అధ్యక్షులు మగ్గరి హన్మండ్లు శుక్రవారం పంపిణి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీ మీద అందిస్తున్న జీలుగు బస్తా రూ. 2452.50 అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డైరక్టర్ విజయ్, ఆంజాగౌడ్, నాళేశ్వర్ గ్రామ సర్పంచ్ ఆర్మూర్ లావణ్య, ఉప సర్పంచ్ ఆర్ముర్ శ్రీనివాస్, లిప్ట్ డైరక్టర్ హన్మండ్లు, రైతులు ద్యాగకిరణ్, మాజి సర్పంచ్ పీతాంబర్, సుదర్శన్, తోట పోతన్న, రమేష్, దేవేందర్, పోశేట్టి, శ్రీనివాస్, సురేష్, మహేష్, ప్రశాంత్, జిల్లా సీఈవో రమేష్ పాల్గొన్నారు.

 

The chairman of the society distributed the seeds.