. . . ముగ్గురికి తీవ్ర గాయాలు
రుద్రూర్, బతుకమ్మ :
ప్రమాదవశాత్తు అదుపుతప్పి ఆటో బోల్తా పడిన ఘటన మంగళవారం సాయంత్రం రుద్రూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. టీఎస్ 16 యుబి 2724 నం. ఆటో వర్ని నుండి రుద్రూర్ వైపుకు వస్తుండగా అక్బర్ నగర్ వద్ద ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఆటోలో ఉన్న సుమారు ఐదుగురికి స్వల్ప గాయాలు కాగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్సులో క్షతగాత్రులను బోధన్ ఏరియా ప్రభుత్వ ఆసుత్రికి తరలించిన్నట్లు స్థానికులు పేర్కొన్నారు.
