Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 October 2025, 7:40 pm Posted by : ramakrishna

స్వగ్రామం చేరిన వలస జీవి మృతదేహం

  • అశృనయనాల మధ్య అంత్యక్రియలు పూర్తి

 

సిరిసిల్ల, బతుకమ్మ : బతుకు దెరువు కోసం దుబాయ్ దేశం వెళ్లిన గంభీరావుపేట మండలం ముస్తఫానగర్ కు చెందిన దోమకొండ శ్రీకాంత్  (26)రోడ్డు ప్రమాదం లో గత అయిదు రోజుల క్రితం మృతి చెందగా శ్రీకాంత్ మృతదేహం శనివారం స్వగ్రామం చేరుకోగా బంధుమిత్రులు,కుటుంబ సభ్యుల అశృనయనాల మధ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. మృతునికి తల్లి చంద్రవ్వ, తండ్రి దేవయ్య లు ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ నాయకులు దోమకొండ కృష్ణకాంత్ యాదవ్,సెస్ మాజీ డైరెక్టర్ కొక్కు దేవేందర్ యాదవ్ లు కోరారు.

The body of a migrant who returned to his hometown