. మద్యం మత్తులో రాష్ డ్రైవింగ్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఆటో ఢీకొట్టిన ఘటన నగరంలోని బోధన్ రోడ్డులో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. దీంతో స్థానికంగా కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆటో డ్రైవర్ కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా మద్యం సేవించినట్లు నిర్ధారణ అయ్యింది. మద్యం మత్తులో రాష్ డ్రైవింగ్ చేసి పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టిన ఆటో డ్రైవర్ మహబూబ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
