- మున్నూరు కాపు నూతన అధ్యక్షులు పుల్లెన్ విట్టల్
బతుకమ్మ, బిచ్కుంద : మున్నూరు కాపు కులస్తులందరూ ఐక్యంగా ఉండి హక్కులను కాపాడుకోవాలని బిచ్కుంద మున్నూరు కాపు సంఘం నూతన అధ్యక్షులు,పుల్లెన్ విట్టల్ కోరారు. గురువారం మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘంలో నూతన అధ్యక్షుడు ఎన్నిక సమావేశంలో మాట్లాడుతూ మున్నూరు కాపు కులస్తులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని సూచించారు. మున్నూరు కాపు కులస్తులకు ఎలాంటి అవసరాలు ఉన్నా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో మున్నూరు కాపు కులస్తులకు ప్రత్యేక గుర్తింపు కొరకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. అనంతరం నూతన అధ్యక్షుడికి శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు కులస్తులు హాజీ బాల్రాజ్, గడ్డం సాయిలు, సాయిని అశోక్, దర్పల్ గంగాధర్, చిన్ సాబ్ సోపాన్ , తదితరులుపాల్గొన్నారు.