Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 December 2025, 12:24 pm Posted by : ramakrishna

ఆ సర్పంచ్ అభ్యర్థికి ఒక్క ఓటు కూడా పడలేదు!

వెబ్ న్యూస్, బతుకమ్మ :  వరంగల్ జిల్లా ఖానాపురం మండలం కీర్యా తండాలో ఈ నెల 17న జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో  బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థికి ఒక్క ఓటు కూడా పడలేదు. మొత్తం 239 ఓట్లు పోలవగా బీజేపీ బలపరిచిన బోడ గౌతమికి కనీసం ఒక్క ఓటు కూడా పడలేదు. దీంతో ఆమె తనకు తానూ ఓటు వేసుకోలేదా? అని  గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  చివరికి నోటాకు ఒక ఓటు పడటం మాత్రం గమనార్హం.