రాజంపేట, బతుకమ్మ :
రాజంపేట మండల కేంద్రంలో శనివారం గ్రామపంచాయతీ కార్యాలయం లో సర్పంచ్ దుబ్బని శ్రీకాంత్ అధ్యక్షతన ఒక సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజంపేట తై బజార్ వేలం పాట నిర్వహించబడునని గ్రామ పంచాయతీ కార్యదర్శి అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున ఆసక్తి ఉండి వేలం పాటలో పాల్గొనాలనుకునేవారు గ్రామపంచాయతీ కార్యాలయానికి వచ్చి కనీస రుసుము చెల్లించి వేలం పాటలో పాల్గొనవలసిందిగా ఆయన కోరారు.