. . . పోస్ట్ మార్టం కాకుండా మహిళ అంత్యక్రియలు
. . . హత్య కావచ్చని అడ్డుకున్న పోలీసులు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం బొప్పాపూర్ లో ఆదివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రుద్రూర్ మండలంలోని బొప్పాపూర్ గ్రామంలో శనివారం రాత్రి మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది..అదే రోజు రాత్రి గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు గడ్డి వాములకు అగ్గి పెట్టారు. ఉదయం వేళ గ్రామంలో కొంతమంది గ్రామస్తులు కలిసి హతురాలి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.
ఈ విషయం రుద్రూర్ పోలీసులకు తెలిసింది. స్థానిక ఎస్సై అక్కడికి వెళ్లి శవయాత్ర అడ్డుకున్నారు. కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత గ్రామస్తులంతా కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. తల్లిని చంపి పరారీ ఐనట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడికి మతిస్థిమితం లేదని గ్రామస్థులు తెలిపారు.
