Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 November 2025, 2:10 pm Posted by : ramakrishna

పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు

వెబ్ న్యూస్, బతుకమ్మ : వైకుంఠ ఏకాదశిపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ నుంచి 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. మొత్తం 182 గంటల దర్శన సమయంలో 164 గంటల సామాన్య భక్తులకే కేటాయిస్తామని తెలిపింది. టీటీడీ పాలక మండలి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  మొదటి మూడు రోజులు రూ. 300 శ్రీవాణి దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. జనవరి 2 నుంచి 8 వరకు రోజుకు 15వేల రూ.300 దర్శన టిక్కెట్లు, 1000 శ్రీవాణి దర్శన టికెట్లు రెగ్యలర్ పద్ధతిల కేటాయిస్తున్నట్లు చెప్పారు.