Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 August 2025, 12:25 pm Posted by : ramakrishna

తాత్కాలికంగా ఏడుపాయల గుడి మూసివేత

సింగూర్ డ్యాం నుంచి కొనసాగుతున్న నీటి విడుదల

మెదక్, బతుకమ్మ :  వరద నీటి ప్రభావం ఎక్కువగా ఉండడంతో మెదక్ జిల్లాలోని శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని ఆలయ ప్రధాన ద్వారాన్ని తాత్కాలికంగా గురువారం మూసివేశారు. సింగూర్ డ్యాం గేట్ నుంచి దిగువన నీళ్లు వదిలారు.  ఆలయ ఆవరణలో మంజీర నది ఉధ్రుతంగా ప్రవహిస్తోంది. వరద నీరు తగ్గిన అనంతరం, తిరిగి ఆలయ సంప్రోక్షణ, అమ్మవారికి అభిషేకం చేసి భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుందని ఆలయ కార్య నిర్వహణ అధికారి తెలిపారు.