శివనామ స్మరణతో మార్మోగిన ఆలయాలు
రుద్రూర్, బతుకమ్మ : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రుద్రూర్ మండల కేంద్రంలోని రాజ రాజేశ్వరాలయం, మార్కండేయ ఆలయం, వీరభద్ర స్వామి ఆలయం, లింగంపల్లి శివాలయం, సులేమాన్ నగర్ లోని స్వయంభూ బసవేశ్వర శివాలయంలో బుధవారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి స్వామివారికి రుద్రాభిషేకం, పాలాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. శివనామస్మరణతో ఆలయాలు మారుమోగాయి. క్లిక్ శంకర్ ఉపవాస దీక్ష చేపట్టిన భక్తులకు పండ్లు వితరణ చేశారు.