Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 December 2024, 5:35 pm Posted by : ramakrishna

రెడ్ క్రాస్ ని సందర్శించిన తెలంగాణ రాష్ట్ర రెడ్ క్రాస్ ప్రధాన కార్యదర్శి డా.శ్రీరాములు

నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాదు జిల్లా శాఖ రెడ్ క్రాస్ కార్యాలయం, రక్తనిధి, తలసేమియా కేంద్రాన్ని  తెలంగాణ రాష్ట్ర రెడ్ క్రాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.శ్రీరాములు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పని తీరును తెలుసుకొని జిల్లా శాఖ చేపడుతున్న కార్యక్రమాలకు జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులుకి, కార్యవర్గానికి అభినందలు తెలుపుతూ కొన్ని సూచనలు తెలిపారు. జిల్లా రెడ్ క్రాస్ సభ్యులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈ సందర్భంగా ఘనంగా సత్కరించి  జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు,రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్ , కోశాధికారి కరిపే రవీందర్ , కార్యదర్శి గోక అరుణ్ బాబు , నిజామాబాదు డివిజన్ చైర్మన్ డా.శ్రీశైలం, జూనియర్  రెడ్ క్రాస్ సమన్వయ కర్త అబ్బాపూర్ రవీందర్ ,బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్ రాజేశ్వర్ ,పి.ఆర్.ఓ బొద్దుల రామకృష్ణ మరియు రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.

Telangana State Red Cross General Secretary Dr. Sriramulu visited the Red Cross