వెబ్ న్యూస్, బతుకమ్మ: విజయవాడ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇందుకోసం పలు రాయితీలను సంస్థ ప్రకటించింది. హైదరాబాద్ – విజయవాడ మార్గంలో లహరి నాన్ ఏసీ,స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 10 శాతం, రాజధాని ఏసీ బస్సుల్లో 8 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. ఈసౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. ముందస్తు రిజర్వేషన్ కోసం https://www.tgsrtcbus.in/oprs-web/ వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించింది.