పోలవరం – నల్లమల సాగర్‌పై తెలంగాణ అభ్యంతరం

వెబ్ న్యూస్, బతుకమ్మ :   ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన పోలవరం - నల్లమల సాగర్‌పై సుప్రీంకోర్టులో అభ్యంతరాలు దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  తెలంగాణ తరఫున సుప్రీంకోర్టులో   సీనియర్‌ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు  వినిపించనున్నారు.  మధ్యాహ్నం 2.30 గంటలకు అభిషేక్ మను సింఘ్వీతో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి భేటీ కానున్నారు.