అమెరికా బయల్దేరిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన చిన్న కుమారుడు ఆర్యను కాలేజీలో చేర్పించేందుకు అమెరికా బయలుదేరి వెళ్లింది. 15 రోజుల పాటు కవిత అమెరికాలోనే ఉండనున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో శనివారం ఉదయం కవిత కు భర్త అనిల్, కుటుంబ సభ్యులు, తెలంగాణ జాగృతి నాయకులు సెండాఫ్ ఇచ్చారు. సెప్టెంబర్ ఒకటో తేదీన కవిత హైదరాబాద్ కు తిరిగి రానున్నారు.