తెలంగాణ సీఎంవో , రాజ్‌భవన్‌ను పేల్చేస్తామంటూ మెయిల్

హైదరాబాద్, బతుకమ్మ:  తెలంగాణ సీఎంవో , రాజ్‌భవన్‌ను పేల్చేస్తామంటూ గుర్తు తెలియని దుండగుడు బెదిరించారు. ఈమేరకు  గవర్నర్ ఆఫీసుకు మెయిల్ కు పంపారు.  దీంతో  పంజాగుట్ట పోలీసులకు గవర్నర్ కార్యాలయ సిబ్బంది ఫిర్యాదు చేశారు. గవర్నర్ సీఎస్ వో  శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.