బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణ అభివృద్ధికి రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేస్తాం
హైదరాబాద్, బతుకమ్మ : స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడిని ఎంపిక చేస్తారని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్తో కలవాల్సిన అవసరం బీజేపీకి లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య అంతర్గత సంబంధం ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధికి రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఎంపీలు ఈటల రాజేందర్ ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు, డీకే అరుణ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.