వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన తహసీల్దార్

  మోర్తాడ్, బతుకమ్మ :   మోర్తాడ్ మండలంలో ని పాలెం దొనకల్ మోర్తాడ్ గ్రామాలలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను బుధవారం మోర్తాడ్ తాసిల్దార్ కృష్ణ పరిశీలించారు. తూకం వేయడం, ట్రాక్ సీట్లను, పరిధాన్యాన్ని కేంద్రంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలను నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం గంగాధర్, సిసిలు మహేందర్, గాజుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.