Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 April 2025, 5:40 pm Posted by : ramakrishna

టెక్నికల్ డిఈఈకి డిచ్పల్లి డివిజన్ బాధ్యతలు

  •  ప్రస్తుత అధికారికి జీఎంగా పదోన్నతి

 

ఇందూర్, బతుకమ్మ:  డిచ్పల్లి డివిజన్ కు ఇంచార్జి డిఈఈ గా రమేష్ అదనపు బాధ్యతలను అప్పగించారు. ఇది వరకు ఉన్న డిఈఈ జాడే ఉత్తమ్ కు జనరల్ మేనేజర్ (ఆపరేషన్)గా పదోన్నతి వచ్చింది. దీంతో పవర్ హౌస్ లో టెక్నికల్ కు డిఈఈగా ఉన్న రమేష్ ను ఇంచార్జిగా నియమిస్తూ సిఎండి ఉత్తర్వులను జారీ చేసారు. డిచ్ పల్లికి డివిజన్ కార్యాలయం తరలించిన సందర్భంలో   అధికారి మారడం చర్చనీయాంశంగా మారింది.  ఇంచార్జి డిఈఈ పూర్తి స్థాయిలో ఓఅండ్ఎం సిబ్బందిని డివిజన్ కు మార్చే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది.