- పంట పొలాల్లో అక్రమంగా నిలువ

వర్ని, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోర గ్రామ శివారు లోని పంట పొలాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 25 టేకు దుంగలను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. గ్రామానికి చెందిన ఓ రైతు అటవీ ప్రాంతంలోని చెట్లను నరికి తన పంట పొలాల్లో దర్జాగా నిల్వ ఉంచారు. ఈ నిల్వను ఓ మాజీ ప్రజాప్రతినిధి చేసినట్ల తన ఇంట్లో కూడా కొన్ని టెక్ కలప దుంగలు దాచినట్లు విశ్వనీయ సమాచారం. ఈ విషయం సంబంధిత ఫారెస్ట్ అధికారులకు తెలిసినా చూసి చూడనట్లు వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో స్థానికుల ఫిర్యాదుతో పంట పొలాలలో నిల్వ ఉంచిన టేకు కలపను పట్టుకొని చర్యలు చేపట్టడం గమనార్హం. వర్ని మండలం జాకోరా, జలాల్పూర్, లక్ష్మాపూర్, పైడిమల్లి వివిధ గ్రామాల్లో అటవీ ప్రాంతంలో దర్జాగా కలపను నరుకుతున్న చూసి చూడనట్టు వివరించడంపై అటవీ శాఖ అధికారులపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
