మండలిలో ఉపాధ్యాయుల గొంతునవుతా
. పీఆర్టీయూ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి నిజామాబాద్, బతుకమ్మ : రెండు దశాబ్దాలకు పైగా ఉపాధ్యాయ వృత్తిలో విద్యార్థులకు విద్య బోధన చేశానని, పాఠశాలల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషిచేశానని, తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే మండలిలో ఉపాధ్యాయుల గొంతుకనవుతానని పీఆర్టీయూ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ లోని పీఆర్టీయూ భవన్ లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సిద్దిపేట జిల్లాలోని మారుమూల గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించిన తాను 22 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో ఎంతో సేవ...