. మధ్యాహ్నం 12 గంటల వరకు 68,205 పట్టభధ్రులు
. ఓటు హక్కు వినియోగించుకున్న 9204 మంది ఉపాధ్యాయులు

నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్- కరీంనగర్-ఆదిలాబాద్- మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మధ్యహ్నం 12 గంటల వరకు 19.20 శాతం నమోదైందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేల సత్పతి తెలిపారు. అలాగే ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ 33.98శాతంగా నమోదైందని పేర్కొన్నారు. నాలుగు గంటల వ్యవధిలో పట్టభధ్రులు 68,205 మంది ఓటు హక్కు వినియోగించుకోగా, 9204 మంది టీచర్లు ఓట్లు వేశారు. నిజామాబాద్ జిల్లాలో మధ్యాహ్నం 12 గంటల సమయానికి పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి 27.44 శాతం, ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి 42.12 శాతం పోలింగ్ నమోదైంది. కామారెడ్డి జిల్లాలో మధ్యాహ్నం 12 గంటల వరకు పట్టభద్రుల నియోజకవర్గానికి 24.4 శాతం, ఉపాధ్యాయ నియోజకవర్గం కు సంబంధించి 38.39 శాతం పోలింగ్ నమోదైంది.
