మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండలంలోని శెట్ పల్లీ గ్రామంలో గురువారం టీ బీ ముక్త్ ప్రోగ్రాం, ఇంటిగ్రేటెడ్ హెల్త్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని హెల్త్ సూపర్వైజర్ ఆకుల మారుతి అన్నారు. కార్యక్రమంలో భాగంగా టీబీ లక్షణాలు ఉన్నవారికి తెమడ పరీక్షలు సేకరించడం జరిగిందని, అలాగే వారిని పై ఆసుపత్రికి ఎక్స్రే రే కోసము పంపడం జరిగిందని, రక్తం పరీక్షలు చేయడం జరిగిందని పేర్కొన్నారు.కార్యక్రమంలో వైద్య సిబ్బంది లావణ్య, సద్గుణ, దివ్య, దీప, టీబీ సూపర్వైజర్ గౌస్ ఆశాలు సరిత, లత, శ్యామల, సుమలత తదితరులు పాల్గొన్నారు.