Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 March 2025, 2:38 pm Posted by : ramakrishna

భద్రాచలంలో వైభవంగా తలంబ్రాల వేడుక

వెబ్ న్యూస్, బతుకమ్మ :  తెలంగాణలోని భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో కల్యాణ వేడుక పనులను వైభవంగా ప్రారంభించారు. ఉత్తరద్వారం వద్ద రోలు, రోకలికి దేవతలను ఆవహన చేసి అర్చకులు పసుపు కొమ్ములు దంచారు. మిథిలా మండపం వద్ద ఉంచిన బియ్యాన్ని తలంబ్రాలుగా చేశారు. ఇందులో భాగంగా తానీషా కాలం నుంచి వస్తున్న సంప్రదాయం ప్రకారం గులాల్ కలిపారు. ఏప్రిల్ 6న శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కల్యాణం జరగనుంది.