ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఇంచార్జ్ హెడ్మాస్టర్ గా అమర జీవుల లక్ష్మీనాథం విధులు నిర్వహించారు.కాగా శుక్రవారం రోజున కొత్తగా గేజిటెడ్ హెడ్మాస్టర్ గా వెంకటరామిరెడ్డి రావడంతో హెడ్మాస్టర్ గా బాధ్యతలు అప్పజెప్పారు.గతంలో కేశ్ పల్లి హైస్కూల్లో సోషల్ స్కూల్ అసిస్టెంట్ గా పనిచేసి ప్రమోషన్ రావడంతో పూర్తిస్థాయి హెడ్మాస్టర్ గా నియమించారు.దీంతో సహచర సిబ్బంది అభినందనలు తెలిపారు.