బంజారాహిల్స్ లోని తాజ్ బంజారా హోటల్ సీజ్

వెబ్ న్యూస్, బతుకమ్మ:  హైదరాబాద్ లోని  బంజారాహిల్స్ లోని తాజ్ బంజారా హోటల్ ను జీహెచ్‌ఎంసీ అధికారులు సీజ్ చేశారు. రెండేళ్లుగా బకాయి ఉన్న రూ.1.40 కోట్ల టాక్స్ చెల్లించడంలేదు. రెడ్ నోటీసు జారీ చేసినా స్పందించకపోవడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తాజ్ బంజారా హోటల్ ను సీజ్ చేశారు.