సిలబస్ తొందరగా పూర్తి చేయాలి
బతుకమ్మ,మోర్తాడ్: నిజామాబాద్ డీఐఈవో రవి కుమార్ మోర్తాడ్ కళాశాలను ఆకస్మికంగా మంగళవారం సందర్శించారు. ఈ సందర్బంగా డీఐఈవో మాట్లాడుతూ తొందరగా సిలబస్ పూర్తి చేసుకొని విద్యార్థులకు స్టడీ హావర్ తీసుకోవాలని, స్పెషల్ క్లాసెస్ తీసుకోవాలని, లాంగ్ ఆబ్సెంట్ పిల్లలను గుర్తించి వారి తల్లి దండ్రులకు చెప్పి రెగ్యులర్ గా కళాశాల కు వచ్చే విధంగా చూడలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు లక్ష్మి నారాయణ, జలపతి, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.