బీర్కూర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం 

బాన్సువాడ , బతుకమ్మ : బీర్కూర్ మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా దుర్గం శ్యామల శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ సమక్షంలో కార్యక్రమం నిర్వహించారు. వైస్ ఛైర్మన్‌గా యామ రాములు, డైరెక్టర్లు ప్రమాణం చేశారు. పాలకవర్గం సభ్యులు రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని పోచారం సూచించారు. ఈ సందర్భంగా బీర్కూర్ లో కాంగ్రెస్ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ...