Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 September 2024, 11:02 am Posted by : ramakrishna

స్వచ్ఛతాహి సేవ అవగాహన ర్యాలీలు

. . . నగరంలో కొనసాగుతున్న స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాలు

బతుకమ్మ నిజామాబాద్ సిటీ..                                                                                                                  

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలు అవగాహన చైతన్యం తీసుకురావడం కోసం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమాలు నగరంలోని పలు డివిజన్ పరిధిలో కొనసాగుతున్నాయి. నిజామాబాద్ మున్సిపల్ కమీషనర్ మంద మకరంధు అదేశాల మేరకు అదివారం  శానిటేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొని ర్యాలీలు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కంటేశ్వర్ ప్రాంతంలో మున్సిపల్ అధికారులు స్వచ్ఛతా హి ర్యాలీని నిర్వహించారు.  అదేవిధంగా 44 వ డివిజన్ పరిధిలో జివిపి పాయింట్ ను శుభ్రం చేశారు. నాందేవాడ చౌరస్తాలో జివిపి పాయింట్ ను తొలగించారు. రఘునాథ చెరువు,మినీ ట్యాంక్ బద్ధ ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ శానిటేషన్ అధికారులు సిబ్బంది, పారిశుద్ధ్య  కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Swachhtahi Seva awareness rallies