బతుకమ్మ, భిక్కనూరు : స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ పథకంలో భాగంగా భిక్కనూరు మండలంలోని సిద్ధ రామేశ్వర నగర్ , మల్లు పల్లి ఎంపిక చేయడం జరిగిందని డిఎల్పిఓ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం సర్వే టీం ఆర్ ఐ రాణి డోర్ టు డోర్ వెళ్లి మీ ఇంటి దగ్గరికి చెత్త బండి వస్తుందా లేదా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు.మీ ఇంట్లో ఉన్న తడి పొడి చెత్తను వేరు వేరు డబ్బాల్లో ఉంచి జీపీ మిత్రులకు అందజేయాలని సూచించారు. గ్రామాలలో ఎక్కడపడితే అక్కడ వెయ్యకూడదని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి ఎస్ బి ఎం టీం నారాయణ మధు కృష్ణ సిద్ధ రామేశ్వరనగర్ సెక్రటరీ అఖిల గ్రామపంచాయతీ సిబ్బంది ఉన్నారు.