Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 January 2025, 5:34 pm Posted by : ramakrishna

రేషన్ కార్డుల, ఇందిరమ్మ ఇళ్ల సర్వే పక్కాగా నిర్వహించాలి

కామారెడ్డి అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్

 

కామారెడ్డి, బతుకమ్మ : సాగుకు యోగ్యమైన భూములను గుర్తించాలని, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు అర్హులకు అందే విధంగా సర్వే నిర్వహించాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ అన్నారు. శుక్రవారం లింగం పేట్ మండలం శెట్పల్లి సంగారెడ్డి, నాగిరెడ్డిపేట్ మండలం ధర్మారెడ్డి, ఎల్లారెడ్డి మండలం లక్మీపూర్ గ్రామాల్లో జరుగుతున్న సర్వే తీరును ఆయన పరిశీలించారు. ఆయన వెంట ఎల్లారెడ్డి ప్రభాకర్, సంబంధిత తహసీల్దార్లు, ఎంపీడీఓ లు పాల్గొన్నారు.