Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 May 2025, 12:15 pm Posted by : ramakrishna

సోషల్ మీడియాలో పోస్టులు.. సజ్జల భార్గవరెడ్డిపై సుప్రీం ఆగ్రహం

డిల్లీ, బతుకమ్మ : వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డిపై  సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో ఆయన పోస్టులు భరించరాని స్థాయికి వెళ్లాయని, దీనిపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం తెలిపింది. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులకు సంబంధించిన కేసుల్లో ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని ఆదేశిస్తూ.. 2 వారాల గడువు ఇచ్చింది.  ఇలాంటి తప్పులను వ్యవస్థ క్షమించదని.. తప్పక శిక్షిస్తుందని వ్యాఖ్యనించింది.